దౌత్యవేత్తల పేరుతో రూ.25 కోట్లకు సున్నం!
దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని విలాసవంతమైన కార్లపై పన్నులు ఎగ్గొడుతున్న ఓ రాకెట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు.
ఇంటర్నెట్డెస్క్: దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని విలాసవంతమైన కార్లపై పన్నులు ఎగ్గొడుతున్న ఓ రాకెట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో గురుగ్రామ్కు చెందిన ‘బిగ్బాయ్ టాయ్స్’ సంస్థ సీఈవో నిపున్ మిగ్లానీ, దుబాయ్కు చెందిన లిఖాయత్ బఛూ ఖాన్, బెంగళూరులోని ఫైనాన్షియర్ సూర్య అర్జున్ ఉన్నారు. వీరు ఇప్పటి వరకూ దౌత్యవేత్తల పేరుతో కార్లు దిగుమతి చేసుకొని రూ.25 కోట్ల మేరకు కస్టమ్స్ సుంకం ఎగ్గొట్టినట్లు తేల్చారు.
ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే బిగ్బాయ్ టాయ్స్ సంస్థ సీఈవో నిపున్ మిగ్లానీను తొలగించినట్లు ప్రకటించింది. దీంతోపాటు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కంపెనీపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించింది. ‘‘బిగ్బాయ్ టాయ్స్ నుంచి నిపున్ మిగ్లానీను తక్షణమే తొలగించాము. ఆయన వ్యక్తిగత స్థాయిలో చేసిన పనులకు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. భవిష్యత్తులో కూడా ఆయనతో చేసే డీల్స్తో సంస్థకు సంబంధం లేదు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరూ బిగ్బాయ్ టాయ్స్కు ఫిర్యాదులు చేయవద్దు’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ కుంభకోణంలో గత ఐదేళ్లలో మొత్తం 20 కార్లను ఎటువంటి పన్నులు చెల్లించకుండా దిగుమతి చేసుకొన్నట్లు డీఆర్ఐ పేర్కొంది. వీటిల్లో రేంజి రోవర్, ల్యాండ్ క్రూజర్ ప్రాడో వంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. వీటిని దౌత్యవేత్తల పేర్లతో దిగుమతి చేసుకొని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. ఈ కేసులో దుబాయ్కు చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడని.. అతన్ని అరెస్టు చేయాల్సి ఉందని డీఆర్ఐ వెల్లడించింది.
ఆఫ్రికా ఖండంలోని ఒక దేశానికి చెందిన దౌత్యవేత్త పేరుతో ఈ కార్లను దిగుమతి చేసుకొన్నట్లు అధికారులు తొలుత గుర్తించారు. ఆ తర్వాత ‘మాంటే కార్లో’ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. దీనిలో భాగంగా దేశంలోని 7 నగరాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆరు కార్లను రికవరీ చేశారు. ఈ వాహనాలను జపాన్, యుకే, యూఏఈ దేశాల్లో కొనుగోలు చేసి దౌత్యవేత్తల పేర్లతో దిగుమతి చేసుకొన్నట్లు గుర్తించారు. ఈ వాహనాలు దేశంలోకి రాగానే కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తి వద్దకు గానీ, విలాసవంతమైన కార్ల విక్రేత వద్దకు గానీ చేరుతున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలోని నిర్ణీత ఆర్టీవోలు వీటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై చెల్లించాల్సిన 204శాతం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు పొందుతున్నారు. ఇలాంటి ఘటనలపై మరింత లోతుగా విచారణ చేయనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి