టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు.. 11మంది మృతి

తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 11 మంది మృతిచెందారు. టపాసుల తయారీ కోసం కొన్ని రసాయనాలు కలుపుతుండగా

Published : 13 Feb 2021 01:59 IST

చెన్నై: తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 11 మంది మృతిచెందారు. టపాసుల తయారీ కోసం కొన్ని రసాయనాలు కలుపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను గుర్తించగా.. గాయపడిన మరో 14 మందిని ఆసుపత్రికి తరలించారు. మంటల్లో మరికొందరు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి..

కారుతో ఢీకొట్టి కార్పొరేటర్‌ హత్య

విందుకు పిలిచి.. లైంగికంగా వేధించి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని