కారు ప్రమాదంలో ఐదుగురి మృతి

శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద కారు అదుపుతప్పి పంట కాల్వలోకిదూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందారు.

Published : 05 Jan 2020 01:29 IST

మందస:  శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద కారు అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో కారు డ్రైవర్‌, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్రేన్‌ సాయంతో కాల్వలో పడిన కారును బయటకు తీశారు. మృతులు ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన డి.ప్రతాప్‌, రీతూ, బనిత జన్నా, ఆదర్శ్‌కుమార్‌గా గుర్తించారు. వీరంతా సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని