వలస కూలీలపై అమానుషం
దేశమంతా లాక్డౌన్ అమల్లో ఉండటంతో వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకోవడంలో చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని బెరెల్లీ జిల్లాకు చేరుకున్న వలస కూలీలపై..
బరేలి (ఉత్తరప్రదేశ్): దేశమంతా లాక్డౌన్ అమల్లో ఉండటంతో వలస కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకోవడంలో చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాకు చేరుకున్న వలస కూలీలపై అధికారులు రోడ్డుపై కెమికల్స్ స్ప్రే చేశారు. దీనిలో పిల్లలు కూడా ఉన్నారు. ఇది చర్చనీయాంశంగా మారడంతో రాజకీయ ప్రముఖలు ఈ చర్యను తప్పుపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ స్పందించారు. ‘‘ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నారు. సీఎంవో పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్, ఫైర్ బిగ్రేడ్ వారికి బస్సులను శుభ్రపరచాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ట్వీట్లో వెల్లడించారు. అయితే జిల్లా యంత్రాగం అధికారి ఒకరు మాట్లాడుతూ.. క్లోరిన్ను నీటితో కలిపి స్ప్రే చేశామని, అమానవీయంగా చేయలేదని తెలిపారు. వలస కూలీలు భారీగా తమ సొంత ప్రాంతాలకు తిరిగి వస్తుండటంతో, ప్రతి ఒక్కరిని పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో ఇలా చేశామని అన్నారు.
ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ, బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయవతి స్పందించారు. ‘‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.... కరోనా వైరస్పై అందరం కలిసి పోరాడుతున్నాం. దయచేసి ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడవద్దు. కూలీలు ఇప్పటికే చాలా నష్టపోయారు. వారిపై రసాయనాలను పిచికారీ చేయవద్దు. ఇది వారిని రక్షించదు, ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది" అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. వలస కూలీలపై ఇలా స్ప్రే చేయడం అన్యాయమని, క్రూరత్వానికి ఉదాహరణ అని మాయవతి అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!