Crime News: దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ నుంచి దూకిన వ్యక్తి మృతి

నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Updated : 01 Oct 2021 14:50 IST

దిల్‌సుఖ్‌నగర్‌: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్‌ లోని దంతెవాడ పరిధి కువకొండకు చెందిన భీమా (45) దినసరి కూలి. జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి పలు మెట్రో స్టేషన్ల వద్ద తిరుగుతున్నాడు. గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకున్న అతను అక్కడి మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. రాజీవ్‌ చౌక్‌ వద్ద పికెట్‌ విధుల్లో ఉన్న పోలీసులు 108 వాహనంలో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని