Crime News: బెదిరించి మహిళపై దుండగుడి అత్యాచారం
ఓ మహిళను బెదిరించిన ప్రబుద్ధుడు ప్రియుడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానభారం భరించలేక బాధితురాలు,అతడు వికారాబాద్ సమీపంలో విషం తాగి
బాధితురాలు, ప్రియుడి ఆత్మహత్యాయత్నం కేసులో వెలుగులోకి కొత్తవిషయం
అమీర్పేట, న్యూస్టుడే: ఓ మహిళను బెదిరించిన ప్రబుద్ధుడు ప్రియుడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానభారం భరించలేక బాధితురాలు,అతడు వికారాబాద్ సమీపంలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన మహిళ(32)కు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో కలిసి కూలిపనులు చేసుకునే మహిళ.. బోరబండ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి(22) పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ వీరిద్దరూ కలుసుకొనేవారు. ఈ క్రమంలో ఈనెల 13న రాత్రి మహిళ ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. తిరిగి వెళుతుండగా అదే ప్రాంతంలో ఉంటున్న ఇస్మాయిల్(23), మరో బాలుడు(17) అటకాయించారు. ప్రియుడి వద్ద ఫోన్ లాక్కొని బెదిరించారు. ఈ అలికిడితో మహిళ బయటకు వచ్చింది. మీ వివాహేతర బంధం బయటపెడతానని ఆమెను ఇస్మాయిల్ బెదిరించి.. గదిలోకి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను బాలుడు వీడియోలో చిత్రీకరించాడు. నిందితులిద్దరూ వెళ్లిపోతూ.. ప్రియుడికి ఫోన్ ఇచ్చేశారు. ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకుందామని భావించిన మహిళ, ఆమె ప్రియుడు.. ఈనెల 14న ద్విచక్ర వాహనంపై వికారాబాద్ సమీపంలోని కండ్లపల్లి గేటు వద్ద నీలగిరి చెట్ల తోటలోకి వెళ్లారు. అప్పటికే దారిలో కొనుగోలు చేసిన విషం తాగారు. అంతకుముందు ప్రియుడు.. తాము ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాన్ని అతని సోదరుడికి ఫోన్లో చెప్పాడు. విషం తాగిన ఇద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లగా.. సమాచారం అందుకున్న బాధితుడి సోదరుడు వెంటనే అక్కడకు వచ్చి వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. శుక్రవారం కోలుకున్న బాధితురాలు.. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఇస్మాయిల్, బాలుడి కోసం గాలిస్తున్నారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక