Crime News: సహజీవనం చేసి.. సజీవ దహనం!

తనతో సహజీవనం చేసిన మహిళను ఓ వ్యక్తి సజీవ దహనం చేశాడు. కూకట్‌పల్లి సీఐ టి.నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఒప్పంద స్వీపర్‌. వికలాంగుల పింఛనుదారు

Updated : 23 Dec 2021 09:42 IST

ప్రాణాపాయ స్థితిలో నిందితుడు

మూసాపేట, న్యూస్‌టుడే: తనతో సహజీవనం చేసిన మహిళను ఓ వ్యక్తి సజీవ దహనం చేశాడు. కూకట్‌పల్లి సీఐ టి.నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఒప్పంద స్వీపర్‌. వికలాంగుల పింఛనుదారు కూడా. పదేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. ఓ కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహం చేసింది. జగద్గిరిగుట్ట రాజీవ్‌ గృహకల్ప సముదాయంలోని ఉండే వెంకటేష్‌(55)తో పరిచయం ఏర్పడింది. వెంకటేష్‌ భార్య చనిపోగా కుమారుడితో ఉంటున్నాడు. అతనికి స్థానికంగా వెల్డింగ్‌ దుకాణం ఉంది. ఇద్దరూ పదేళ్లపాటు సహజీవనం చేశారు. మనస్పర్థలు తలెత్తడంతో వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌కు మకాం మార్చింది. తనతోనే ఉండాలని వెంకటేష్‌ పలుమార్లు ఒత్తిడి తెచ్చి వేధించాడు. ఆమె ససేమిరా అనడంతో పగ పెంచుకున్నాడు. బుధవారం సాయంత్రం ఆమె కుమారుడు విధులకు వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో వెంకటేష్‌ ఆమె వద్దకు వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో నుంచి మంటలు ఎగసి పడుతుండటాన్ని గమనించిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా కాలిన గాయాలతో వెంకటలక్ష్మి చనిపోయి ఉంది. వెంకటేష్‌ సైతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతుండటంతో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గొడవ జరగడంతో ఆవేశంలో ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ క్రమంలో మంటలు అతనికీ అంటుకుని ఉంటాయని అనుమానిస్తున్నారు. ఎస్సై పి.సురేష్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని