Hyderabad News: వ్యాపారంలో నష్టాలు.. ఏసీ బోగీల్లో చోరీలు
వ్యాపారాల్లో నష్టాలు రావడంతో.. రైళ్లలోని ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణికుల నగలను అపహరిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు....
ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్.. రూ.23 లక్షల సొత్తు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న నగలు, నిందితులతో రైల్వే ఎస్పీ అనూరాధ తదితరులు
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: వ్యాపారాల్లో నష్టాలు రావడంతో.. రైళ్లలోని ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణికుల నగలను అపహరిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.23 లక్షల విలువైన 55.1 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో.. డీఎస్పీ నర్సయ్య, ఇన్స్పెక్టర్లు శ్రీను, సరస్పత్తో కలిసి ఎస్పీ అనూరాధ వివరాలను వెల్లడించారు. ఝార్ఖండ్ రాష్ట్రం రంధి జిల్లా సరోవర్నగర్ వాసి రంజన్కుమార్ శ్రీవాస్తవ్(63) వస్త్ర వ్యాపారం చేస్తుండేవాడు. ఉత్తర్పదేశ్లోని లఖ్నవ్ ప్రాంతానికి చెందిన రాజీవ్ రస్తోగి(42) కృత్రిమ జ్యుయలరీ వ్యాపారి. ఐదేళ్ల క్రితం రైల్లో హైదరాబాద్కు వస్తున్న సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. వ్యాపార అవసరాలకు నగరానికి వచ్చిన ప్రతిసారి అబిడ్స్లోని ఓ లాడ్జీలో కలిసే దిగేవారు. అనంతరం వ్యాపారాల్లో నష్టాలు రావడంతో ఇద్దరూ రైళ్లలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఏసీ కోచ్ల్లో రాకపోకలు సాగించే వారు అప్రమత్తంగా ఉండరని భావించి వాటిల్లో దొంగతనాలకు ఉపక్రమించారు. ఇద్దరూ ఏసీ బోగీల్లో ప్రయాణిస్తూ.. తోటి ప్రయాణికుల బ్యాగుల్లోని నగలు, నగదు కాజేయసాగారు. 2019లో ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్లో తొలిసారిగా చోరీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి చంద్రశేఖర్ కుటుంబీకులతో కలిసి కోకోనాడ రైలులో ప్రయాణిస్తుండగా.. బ్యాగులోని 10 గ్రాముల బంగారు నగలు, విలువైన చీరలు చోరీ కావడంతో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గౌతమి, హమ్సఫర్, చార్మినార్, ఈస్ట్కోస్ట్, నాగర్సోల్, కోకోనాడ ఎక్స్ప్రెస్ రైళ్లలోనూ దొంగతనాలకు పాల్పడ్డారు. వాటిపైనా ఫిర్యాదులు వచ్చాయి. కోకోనాడ రైల్లోని ఏసీ బోగీలో సీసీ కెమెరాలను పరిశీలించగా నిందితుల దృశ్యాలు వెలుగుచూశాయి. బుధవారం ఉదయం రైల్వేస్టేషన్లోని పదో నెంబరు ప్లాట్ఫాంపై నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో 11 చోరీలు చేసినట్లు వారు అంగీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి