బైక్ను ఢీకొట్టిన వాహనం.. ముగ్గురి దుర్మరణం
మేడ్చల్ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘట్కేసర్ సీఐ ఎన్.చంద్రబాబు వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో వరంగల్-హైదరాబాద్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఘటన
ఘట్కేసర్, న్యూస్టుడే: మేడ్చల్ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘట్కేసర్ సీఐ ఎన్.చంద్రబాబు వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి అవుషాపూర్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుందని డయల్ 100కు సమాచారం వచ్చింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజపల్లికి చెందిన పాలడుగు నవీన్(25) ఉప్పల్లో ఉంటూ కారు డ్రైవర్గా పని చేస్తున్నారు. అదే జిల్లా లింగాలఘనాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్(23) దిల్సుఖ్నగర్లో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచింతాపూర్ గ్రామానికి చెందిన ఎన్.వినీత(21) హిమాయత్నగర్లోని ఓప్రైవేటు వసతి గృహంలో ఉంటోంది. ఈ ఘటనలో వీరు ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించారు. దాసరి నవీన్, వినీత పంజాగుట్టలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. బుధవారం ముగ్గురు బైకుపై యాదాద్రికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఉప్పల్ వైపు బైకుపై కలిసి వస్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్న ఓ లారీని గుర్తించారు. తెల్లవారుజామున 4:40గంటల ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన ఓ బంకులో పెట్రోల్ పోయించుకున్నట్లు సీసీ కెమెరాలో గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్