రెండు గంటలు నరకయాతన!
కోటనందూరు, న్యూస్టుడే: కొళాయి ఏర్పాటు కోసం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ గొయ్యిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు రెండు గంటలపాటు నరకయాతన పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల చొరవతో ప్రాణాలతో బయటపడ్డారు. కోటనందూరు మండలం బొద్దవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికీ కొళాయిలు వేసేందుకు గ్రామంలోని ఇందిరమ్మకాలనీలో తెలంగాణ నుంచి వలస వచ్చిన కార్మికులు శుక్రవారం ఉదయం పనులు చేస్తున్నారు. కొళాయి ఏర్పాటుకు తీసిన గొయ్యిలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామానికి చెందిన సూరా నాగేశ్వరరావు అనే కార్మికుడు దిగాడు. ఒక్కసారిగా మట్టి జారిపడడంతో అందులో కూరుకుపోయాడు. అతడిని బయటకు లాగే క్రమంలో మరో కార్మికుడు ఆలకుంట బాలయ్య దిగగా ఇద్దరూ నేలలోనే కూరుకుపోయారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోగా స్థానికుల చొరవతో పొక్లెయిన్ సహకారంతో బాలయ్యను బయటకు తీశారు. అగ్నిమాపక వాహనంతో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులంతా అక్కడికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. పొక్లెయిన్ సాయంతో నాగేశ్వరరావు చుట్టూ ఉన్న మట్టిని తొలగించారు. అగ్నిమాపక సిబ్బంది గొయ్యిలోకి దిగి అతడిని తాళ్లతో బయటకు తీయడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా బయటకు తీసిన బాలయ్యను తుని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తోటి కార్మికులు తెలిపారు. తుని గ్రామీణ సీఐ సన్యాసిరావు, సిబ్బందితో కలిసి వచ్చి కూరుకుపోయిన కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయాలపాలైన బాలయ్యకు మెరుగైన చికిత్స అందించాలని సహచర కార్మికులు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది: ప్రధాని మోదీ
-
Ts-top-news News
TSRTC: 75 ఏళ్లు దాటిన వారికి నేడు ఉచిత ప్రయాణం
-
Crime News
Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
-
India News
I-Day: స్వాతంత్య్ర వేడుకల వేళ పంజాబ్లో ఉగ్రముఠా కుట్రలు భగ్నం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్ఛైర్లో ఝున్ఝున్వాలా డ్యాన్స్
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Liger: సూపర్స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
- Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
- Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్.. ఝున్ఝున్వాలా చెప్పిన విజయసూత్రాలివే!
- Crime News: బిహార్లో తెలంగాణ పోలీసులపై కాల్పులు