రెండు గంటలు నరకయాతన!
కొళాయి ఏర్పాటు కోసం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ గొయ్యిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు రెండు గంటలపాటు నరకయాతన పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల చొరవతో ప్రాణాలతో బయటపడ్డారు.
కోటనందూరు, న్యూస్టుడే: కొళాయి ఏర్పాటు కోసం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ గొయ్యిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు రెండు గంటలపాటు నరకయాతన పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల చొరవతో ప్రాణాలతో బయటపడ్డారు. కోటనందూరు మండలం బొద్దవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికీ కొళాయిలు వేసేందుకు గ్రామంలోని ఇందిరమ్మకాలనీలో తెలంగాణ నుంచి వలస వచ్చిన కార్మికులు శుక్రవారం ఉదయం పనులు చేస్తున్నారు. కొళాయి ఏర్పాటుకు తీసిన గొయ్యిలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామానికి చెందిన సూరా నాగేశ్వరరావు అనే కార్మికుడు దిగాడు. ఒక్కసారిగా మట్టి జారిపడడంతో అందులో కూరుకుపోయాడు. అతడిని బయటకు లాగే క్రమంలో మరో కార్మికుడు ఆలకుంట బాలయ్య దిగగా ఇద్దరూ నేలలోనే కూరుకుపోయారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోగా స్థానికుల చొరవతో పొక్లెయిన్ సహకారంతో బాలయ్యను బయటకు తీశారు. అగ్నిమాపక వాహనంతో పాటు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులంతా అక్కడికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. పొక్లెయిన్ సాయంతో నాగేశ్వరరావు చుట్టూ ఉన్న మట్టిని తొలగించారు. అగ్నిమాపక సిబ్బంది గొయ్యిలోకి దిగి అతడిని తాళ్లతో బయటకు తీయడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా బయటకు తీసిన బాలయ్యను తుని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తోటి కార్మికులు తెలిపారు. తుని గ్రామీణ సీఐ సన్యాసిరావు, సిబ్బందితో కలిసి వచ్చి కూరుకుపోయిన కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయాలపాలైన బాలయ్యకు మెరుగైన చికిత్స అందించాలని సహచర కార్మికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!