తల్లీ బిడ్డ ఆత్మహత్య

 తల్లీ కూతుళ్లిద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా థారూర్‌కు చెందిన తులసీబాయి(40), ఆమె కుమార్తె శిరీష(16) బోరబండ  

Updated : 19 Aug 2022 06:11 IST

శిరీష, తులసీబాయి

అమీర్‌పేట, న్యూస్‌టుడే:  తల్లీ కూతుళ్లిద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా థారూర్‌కు చెందిన తులసీబాయి(40), ఆమె కుమార్తె శిరీష(16) బోరబండ  సారథి కో-ఆపరేటీవ్‌ సొసైటీ సమీప గుడిసెల్లో ఉంటున్నారు. తులసీబాయి జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలు. శిరీష ఇళ్లలో పనిచేస్తుంది. గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పక్క గుడిసెలో ఉంటున్నవారు తల్లీబిడ్డ ఇద్దరు దూలానికి ఉరేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. తులసీబాయి భర్త గోపాల్‌ నాలుగేళ్ల కిందట ఇదే గుడిసెలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కూతురు పెళ్లై వెళ్లిపోగా, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. తులసీబాయి, శిరీష ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని