రూ.కోట్లు కూడబెట్టాలని దోపిడీలు!
అడ్డదారిలో సొమ్ము సంపాదించాలి.. షేర్మార్కెట్లో రూ.కోట్లు కూడబెట్టాలి.. దీనికోసం హత్య, దోపిడీలు, దొంగతనాలు మార్గంగా ఎంచుకున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం
సొత్తు పరిశీలిస్తున్న అదనపు సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు
ఈనాడు, హైదరాబాద్: అడ్డదారిలో సొమ్ము సంపాదించాలి.. షేర్మార్కెట్లో రూ.కోట్లు కూడబెట్టాలి.. దీనికోసం హత్య, దోపిడీలు, దొంగతనాలు మార్గంగా ఎంచుకున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బషీర్బాగ్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, ఇన్స్పెక్టర్ కె.శ్రీనాథ్రెడ్డి, ఎస్సార్నగర్ డీఐ రాంప్రసాద్తో కలిసి నగర అదనపు సీపీ (క్రైమ్, సిట్) ఏఆర్.శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు నివాసి కోనేటి జ్ఞానేశ్వర్ (26). 2019లో బీఎస్సీ మధ్యలో ఆపేసి కారు డ్రైవర్గా మారాడు. ములుగు జిల్లా వెంకటాపూర్కు చెందిన నీలం శ్రీనివాస్ (33) ఖమ్మం జిల్లా జైలులో ఉన్నప్పుడు జ్ఞానేశ్వర్తో స్నేహం ఏర్పడింది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పెద్దఎత్తున దోపిడీ చేయాలనే పథకం వేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద జ్యోతిషుడు.. చెలపూరి పెద్దస్వామి పేరు ప్రఖ్యాతల గురించి శ్రీనివాస్ విన్నాడు. పెద్దస్వామి వద్ద డబ్బు ఉంటుందని భావించి జ్ఞానేశ్వర్తో కలిసి ఆశ్రమానికి వెళ్లారు. మే 3న అర్ధరాత్రి దాటాక ఇద్దరూ స్వామి గదిలోకి వెళ్లి టవల్లో గొంతు నులిమి చంపారు. సూర్యాపేట్లో ద్విచక్ర వాహనం చోరీ చేశారు. విజయవాడ చేరి 8 గొలుసు చోరీలు చేశారు. ఇటీవలే నగరానికి చేరిన జ్ఞానేశ్వర్, శ్రీనివాస్.. చోరీ చేసిన బైకుపై వెళ్తూ ఎస్సార్నగర్ పరిధిలో ఓ మహిళ మెడలో గొలుసు కొట్టేశారు. ఎస్సాఆర్ నగర్ పోలీసులు, టాస్క్ఫోర్స్ బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.