గొలుసు దొంగల ముఠా అరెస్టు
ఒంటరిగా వెళుతున్న వృద్ధుల మెడలోంచి బంగారు ఆభరణాలు దోచుకునే దొంగల ముఠాను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాల ప్రకారం..
10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాల స్వాధీనం
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు,
బంగారు, వెండి ఆభరణాలు
వనపర్తి న్యూటౌన్, న్యూస్టుడే : ఒంటరిగా వెళుతున్న వృద్ధుల మెడలోంచి బంగారు ఆభరణాలు దోచుకునే దొంగల ముఠాను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన చీర్ల ఈశ్వరయ్య చోరీ కేసులతో పాటు పీడీ యాక్ట్పై జైలు శిక్ష అనుభవించి ఏప్రిల్లో విడుదలయ్యాడు. ఈయన తన భార్య రాధ, హైదరాబాదులోని జగద్గిర్గుట్టకు చెందిన వేణు ఆలియాస్ అఖిల్ ఓ ముఠాగా ఏర్పడి గొలుసు చోరీలకు పాల్పడ్డారు. శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఆగస్టు 8న ఒంటరిగా వెళుతున్న వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. సెప్టెంబరు 14న పెద్దమందడి మండల కేంద్రంలో వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతుండగా ఆమెతో రాధ మాట్లాడుతుండగా ఈశ్వరయ్య, వేణు ఆభరణాలను లాక్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ సీఐ శ్రీనివాసాచారి, ఎస్సైలు హృషికేష్, అంజద్, హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, గోవింద, సిబ్బంది సమరసింహారెడ్డి, మురళి నిందితుల కోసం వేట సాగించారు. హైదరాబాదులో ఉంటున్నట్లు తెలుసుకుని ఈశ్వరయ్య, వేణును చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో పెద్దమందడి, శ్రీరంగాపూర్, మరికల్, పెంట్లవెళ్లి, కోడేరు, ముసాపేట, బొంరాస్పేట, హైదరాబాదులోని పహాడీషరీఫ్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. వీరి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 45 తులాల వెండి ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సోమవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
-
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
-
TS News: త్వరలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి