గొలుసు దొంగల ముఠా అరెస్టు
ఒంటరిగా వెళుతున్న వృద్ధుల మెడలోంచి బంగారు ఆభరణాలు దోచుకునే దొంగల ముఠాను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాల ప్రకారం..
10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాల స్వాధీనం
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు,
బంగారు, వెండి ఆభరణాలు
వనపర్తి న్యూటౌన్, న్యూస్టుడే : ఒంటరిగా వెళుతున్న వృద్ధుల మెడలోంచి బంగారు ఆభరణాలు దోచుకునే దొంగల ముఠాను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 10 తులాల బంగారు, 45 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన చీర్ల ఈశ్వరయ్య చోరీ కేసులతో పాటు పీడీ యాక్ట్పై జైలు శిక్ష అనుభవించి ఏప్రిల్లో విడుదలయ్యాడు. ఈయన తన భార్య రాధ, హైదరాబాదులోని జగద్గిర్గుట్టకు చెందిన వేణు ఆలియాస్ అఖిల్ ఓ ముఠాగా ఏర్పడి గొలుసు చోరీలకు పాల్పడ్డారు. శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఆగస్టు 8న ఒంటరిగా వెళుతున్న వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. సెప్టెంబరు 14న పెద్దమందడి మండల కేంద్రంలో వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతుండగా ఆమెతో రాధ మాట్లాడుతుండగా ఈశ్వరయ్య, వేణు ఆభరణాలను లాక్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ సీఐ శ్రీనివాసాచారి, ఎస్సైలు హృషికేష్, అంజద్, హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతిరెడ్డి, శ్రీనివాసులు, గోవింద, సిబ్బంది సమరసింహారెడ్డి, మురళి నిందితుల కోసం వేట సాగించారు. హైదరాబాదులో ఉంటున్నట్లు తెలుసుకుని ఈశ్వరయ్య, వేణును చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో పెద్దమందడి, శ్రీరంగాపూర్, మరికల్, పెంట్లవెళ్లి, కోడేరు, ముసాపేట, బొంరాస్పేట, హైదరాబాదులోని పహాడీషరీఫ్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. వీరి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 45 తులాల వెండి ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సోమవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!