నెల రోజుల్లో పెళ్లి... అంతలోనే కబళించిన మృత్యువు
ఆ ఇంట పెద్దలు.. పిల్లలు రంగురంగుల మెహందీలు.. కొత్తదుస్తులు.. శుభలేఖల పంపిణీ...
మహమ్మద్అలి (పాత చిత్రం)
బద్వేలు, న్యూస్టుడే: ఆ ఇంట పెద్దలు.. పిల్లలు రంగురంగుల మెహందీలు.. కొత్తదుస్తులు.. శుభలేఖల పంపిణీ... బ్యాండు మేళం మోగడానికి రోజులు దగ్గరికి వస్తున్నాయి.. నెల రోజుల్లో ఆ ఇంట పెళ్లి సందడి కనిపించనుంది. ఈలోపే విధి వక్రీకరించింది. బద్వేలు పట్టణంలోని సుమిత్రానగర్కు చెందిన మహమ్మద్ దంపతుల రెండో కుమారుడు మహమ్మద్ అలి (26) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయునిపల్లెలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మహమ్మద్ అలీ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. స్నేహితుడు దినేష్తో కలసి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చొని ఆదివారం నెల్లూరు జిల్లాలోని కలువాయికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కదిరినాయునిపల్లె వద్ద గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం నుంచి పడిపోయారు. హెల్మెట్ ఉన్న దినేష్కు స్వల్పగాయాలు అయ్యాయి. మహమ్మద్ అలీ అలాగే వెనక్కిపడిపోవడంతో తలకు తీవ్ర గాయమై మృతిచెందారు. విషయం తెలిసి తల్లిదండ్రులు, బంధువులు విలపించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఒంటిమిట్ట, న్యూస్టుడే: మండల పరిధి మలకాటిపల్లె ఎస్సీకాలనీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గాలి ఓబులసుబ్బన్న అలియాస్ అంకయ్య (52) కడప సర్వజన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. కడుపునొప్పి తాళలేక ఈ నెల 2న విష ద్రావణం తాగారు. కుటుంబ సభ్యులు గుర్తించి కడప సర్వజన ఆసుపత్రికి 108 వాహనంలో తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు విచారణ చేస్తున్నామని ఏఎస్సై చెప్పారు.
వివాహిత ఆత్మహత్య
పోరుమామిళ్ల, న్యూస్టుడే: మండలంలోని పెద్దకప్పలపల్లె గ్రామానికి చెందిన పి.సరోజ (23) కొండుగారిపల్లె వద్ద ఉన్న తెలుగుగంగ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని ఏఎస్సై రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఏఎస్సై వివరాల మేరకు... సరోజ భర్త నారాయణకు బావమరిదులకు మనస్పర్ధలు ఉన్నాయి. సోమవారం ఇంటి వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి చెందిన సరోజ గంగ కాలువలో దూకిందని తెలిపారు. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.
ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పెండ్లిమర్రి, న్యూస్టుడే : నందిమండలం కొండగంగమ్మ ఆలయం సమీపంలో సోమవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందారని ఎస్.ఐ రాజరాజేశ్వర్రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణానికి చెందిన సాయి కృష్ణ (22) సోమవారం సాయంత్రం వెల్లటూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. తెలిసిన వారి ద్విచక్రవాహనం తీసుకుని పులివెందులకు వెళ్తుండగా మార్గమధ్యంలో డివైడర్ను ఢీకొని కింద పడిపోయారు. గాయపడిన అతన్ని స్థానికులు వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం