భయపెట్టడంతోనే బాలిక ఆత్మహత్య
మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీ వీడింది. కొందరు భయభ్రాంతులకు గురిచేయటంతోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు.
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మహేశ్, సీఐ, చిత్రంలో నిందితులు
జడ్చర్ల గ్రామీణం, న్యూస్టుడే : మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి ఘటన మిస్టరీ వీడింది. కొందరు భయభ్రాంతులకు గురిచేయటంతోనే బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. జడ్చర్ల ఠాణాలో సీఐ జమ్ములప్ప, బాలానగర్ ఎస్సై జయప్రసాద్లతో కలిసి మహబూబ్నగర్ డీఎస్పీ మహేశ్ వివరాలను వెల్లడించారు. బాలానగర్ మండలంలోని ఓ తండాలో బాలిక(15)ను కలిసేందుకు ఈ నెల 2న రాత్రి ఆమె ఇంటికి స్నేహితుడైన చిన్నరేవల్లికి చెందిన షానమోని శివ వచ్చాడు. రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వస్తున్న శివను బాలికకు బాబాయి వరసయ్యే అదే గ్రామానికి చెందిన నేనావత్ శ్రీను అలియాస్ డబ్బా శ్రీను, నేనావత్ శ్రీను(అడ్వకేట్), తిర్మలగిరికి చెందిన సింగమోని సుదర్శన్ పట్టుకొని కొట్టారు. శివ ఫోన్ తీసుకుని దాని ద్వారా బాలికకు నేనావత్ శ్రీను చాటింగ్ చేశాడు. బాలికను కలిసిన విషయంపై కుల పెద్దలకు చెప్పి పంచాయతీ పెడతామని బ్లాక్ మెయిల్ చేసి రూ. 10వేలు డిమాండు చేశారు. బాలిక ఇంటికి వెళ్లి తలుపులు కొట్టి లేపే ప్రయత్నం చేయగా ఆమె తెరవలేదు. శివ వద్ద ఉన్న రూ.3వేలు తీసుకొని మిగిలిన డబ్బులు ఉదయం ఇచ్చి ఫోన్ తీసుకెళ్లాలని చెప్పారు. తర్వాత ముగ్గురు కలిసి బాలికను భయబ్రాంతులకు గురిచేశారు. ఆందోళనకు గురైన బాలిక ఈనెల 3న ఉదయం 6.20కి తండ్రికి ఫోన్ చేసి మాట్లాడింది. తర్వాత ఆమె బావకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెస్సేజ్ పంపింది. ఉదయం 7.20 నిమిషాలకు చున్నీతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. డబ్బులు తీసుకొని ఉదయం తండాకు బయలుదేరిన శివ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి వెనుదిరిగాడు. శివ ఇంటికి రావటం వల్లనే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని డబ్బా శ్రీను, నేనావత్ శ్రీను, సుదర్శన్ తండావాసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన బంధువులు శివ ఇంటితో పాటు వాహనం, తండాలోని డబ్బా శ్రీను, నేనావత్ శ్రీను ఇళ్లపైనా దాడి చేశారు. వాహనాలకు నిప్పంటించారు. బాలిక మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పోస్టుమార్టం చేయకుండా కొందరు అడ్డుకొని ఆందోళనలు చేపట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని బంధువులు ఆరోపించటంతో ఫొరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం చేశారు. అత్యాచారం జరిగిందా లేదా అన్నదానిపై నివేదిక రావాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. నలుగురు నిందితులు ఎంపీటీసీ సభ్యుడు వెంకట్రాంనాయక్ను కలిసి సీఐ ముందు లొంగిపోయినట్లు చెప్పారు. నలుగురిని అరెస్టు చేసి సెల్ఫోన్లు, శివ వాడిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. బాలిక ఎస్టీ కావటంతో నిందితుడు శివపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవుతుందని వెల్లడించారు. దాడులతో ఆస్తులను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పు పెట్టి శాంతిభత్రలకు విఘాతం కలిగించినందుకు మరో నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్