Hanumakonda: పెళ్లికి అంగీకరించడంలేదని.. ప్రేయసి గొంతు కోశాడు

పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

Updated : 04 Jan 2023 07:12 IST

మడికొండ, న్యూస్‌టుడే: పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, మడికొండ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ గుజ్జేటి వేణు కథనం ప్రకారం.. కడిపికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్‌ (35) అదే గ్రామానికి చెందిన యువతి (26) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో అతడు ఆమె మతాన్ని స్వీకరించినట్లు తెలిసింది. పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కొద్దిరోజులుగా గొడవలు పడుతున్నారు. ఇదే విషయంపై శ్రీనివాస్‌ మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి నిలదీశాడు. అంగీకరించకపోవడంతో యువతి గొంతు, చేయి కోసి గాయపరిచాడు. ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు అతడిని చితకబాదారు. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు గ్రామానికి చేరుకుని యువతిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని, విచారణ చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని