Heart Attack: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి

అప్పటి వరకు కన్నవారి కళ్లముందే హుషారుగా ఆడుకున్న పన్నెండేళ్ల బాలుడు ఒక్కసారిగా గుండెపోటుతో విలవిల్లాడిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఆ చిన్నారి ప్రాణం దక్కలేదు.

Published : 09 Jan 2023 08:15 IST

మడికేరి, న్యూస్‌టుడే: అప్పటి వరకు కన్నవారి కళ్లముందే హుషారుగా ఆడుకున్న పన్నెండేళ్ల బాలుడు ఒక్కసారిగా గుండెపోటుతో విలవిల్లాడిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఆ చిన్నారి ప్రాణం దక్కలేదు. ఈ ఘటన కర్ణాటకలోని మడికేరి జిల్లాలో జరిగింది. కుశాలనగర తాలూకా కూడుమంగళూరులో పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేసే మంజాచారి కుమారుడు కీర్తన్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఆడుకుని, రాత్రి కావస్తుండటంతో ఇంట్లోకి వచ్చాడు. కాసేపటికి గుండెలో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి బాధతో తల్లడిల్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కుశాలనగర ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. గుండెపోటువల్ల అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. కీర్తన్‌కు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని బంధువులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని