Crime News: కారుతో ఢీకొట్టి 12 కి.మీ. లాక్కుపోయాడు

కొత్త సంవత్సరాది వేళ దిల్లీలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువతిని కారుతో ఢీకొట్టి కొంత దూరం అలాగే లాక్కొంటూ పోయిన దారుణం లాంటిదే గుజరాత్‌లోని సూరత్‌లోనూ జరిగింది.

Updated : 25 Jan 2023 07:11 IST

సూరత్‌: కొత్త సంవత్సరాది వేళ దిల్లీలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువతిని కారుతో ఢీకొట్టి కొంత దూరం అలాగే లాక్కొంటూ పోయిన దారుణం లాంటిదే గుజరాత్‌లోని సూరత్‌లోనూ జరిగింది. జనవరి 18వ తేదీ రాత్రి కడోదరా - బార్డోలి రోడ్డుపై జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాగర్‌ పాటిల్‌ (24) తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా శరవేగంతో దూసుకొచ్చిన ఓ కారు వీరిని ఢీకొంది. బైకుపై ఉన్న మహిళ కింద పడిపోగా, కారు కింది భాగంలో చిక్కుకుపోయిన సాగర్‌ను కారు ఆపకుండా డ్రైవరు 12 కిలోమీటర్లు లాక్కొని వెళ్లాడు. తీవ్రంగా గాయపడిన సాగర్‌ ప్రాణాలు విడిచాడు. ఈ వైనమంతా వీడియో తీసిన ఓ పౌరుడు పోలీసులకు దాన్ని చేరవేయడంతో విచారణ పని సులువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని