కారు.. టిప్పర్‌ ఢీ

రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్‌కలెక్టర్‌ సేతు మాధవన్‌ సహా నలుగురికి గాయాలయ్యాయి. సేతు మాధవన్‌ శనివారం కారులో మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తున్నారు.

Published : 29 Jan 2023 04:37 IST

సబ్‌ కలెక్టర్‌ సహా నలుగురికి గాయాలు

పొదిలి గ్రామీణం, చీమకుర్తి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్‌కలెక్టర్‌ సేతు మాధవన్‌ సహా నలుగురికి గాయాలయ్యాయి. సేతు మాధవన్‌ శనివారం కారులో మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తున్నారు. పొదిలి మండలం ఉప్పలపాడు విద్యుత్తు సబ్‌స్టేషన్‌ సమీపంలో టిప్పర్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీలోకి వెళుతోంది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారు, టిప్పర్‌ ఢీకొన్నాయి. కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సబ్‌కలెక్టర్‌, వ్యక్తిగత సహాయకుడు, అటెండర్‌ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కారులో నుంచి దింపి సపర్యలు చేశారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని