ఒడిశా మంత్రి హత్య
ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్ దాస్ (61) కాల్పుల్లో మృతి చెందారు. ఆదివారం ఝార్సుగూడ జిల్లా బ్రజరాజనగర్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కారు దిగుతుండగా ఏఎస్సై గోపాల్ చంద్ర దాస్ ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
కాల్పులు జరిపిన ఏఎస్సై
అధికారులపై కోపంతో దారుణానికి ఒడిగట్టిన పోలీసు
కటక్, న్యూస్టుడే: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్ దాస్ (61) కాల్పుల్లో మృతి చెందారు. ఆదివారం ఝార్సుగూడ జిల్లా బ్రజరాజనగర్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కారు దిగుతుండగా ఏఎస్సై గోపాల్ చంద్ర దాస్ ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక తూటా మంత్రి ఛాతీలోకి దూసుకెళ్లింది. తోటి పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా గోపాల్చంద్ర దాస్ వారిపైనా తుపాకీ గురిపెట్టాడు. అక్కడ ఉన్నవారు చేతిని బలవంతంగా పైకి ఎత్తడంతో మరో రెండు రౌండ్లు గాల్లోకి కాల్చాడు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుప్పకూలిపోయిన మంత్రిని మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్లో భువనేశ్వర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసి పర్యవేక్షణలో ఉంచగా.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మంత్రి చనిపోయినట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. మరోవైపు మానసిక వ్యాధితోనే గోపాల్చంద్ర దాస్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అతడి భార్య మీడియాకు వెల్లడించారు. పదేళ్లుగా ఔషధాలను వాడుతున్నట్లు తెలిపారు. గంజాం జిల్లా బ్రహ్మపురకు చెందిన గోపాల్కు రెండేళ్ల క్రితం బ్రజరాజనగర్కు బదిలీ అయిందని, ఎప్పుడు సెలవులు అడిగినా ఉన్నతాధికారులు ఇవ్వకపోవడంతో ఫోన్ చేసి బాధపడేవాడని ఆమె చెప్పారు. 1962 జనవరి 7న ఝార్సుగుడలో జన్మించిన నబ కిశోర్ దాస్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఝార్సుగుడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మరోసారి విజయం సాధించారు. అనంతరం పార్టీకి రాజీనామా చేసి 2019లో బిజదలో చేరి మూడోసారి గెలిచి, సీఎం నవీన్ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!