కుటుంబ కలహాలతో ముగ్గురి సజీవ దహనం
కుటుంబ గొడవల కారణంగా ఇద్దరు పిల్లలు సహా ముగ్గురిపై పెట్రోల్ పోసి హతమార్చాడో వ్యక్తి. తర్వాత అతడు కూడా ఆత్మాహుతి చేసుకున్నాడు.
నిందితుడి ఆత్మాహుతి
తమిళనాడులో దారుణం
చెన్నై, న్యూస్టుడే: కుటుంబ గొడవల కారణంగా ఇద్దరు పిల్లలు సహా ముగ్గురిపై పెట్రోల్ పోసి హతమార్చాడో వ్యక్తి. తర్వాత అతడు కూడా ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ దుర్ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కడలూరు జిల్లా సెల్లాంకుప్పం వెళ్లిప్పిళ్లైయార్ కోవిల్ వీధికి చెందిన ప్రకాష్కు భార్య తమిళరసి (31), కుమార్తె హాసిని (4 నెలలు) ఉన్నారు. తమిళరసి సోదరి ధనలక్ష్మి, సద్గురు దంపతులకు ఆరు నెలల మగ శిశువు ఉన్నాడు. సద్గురు, ధనలక్ష్మిలు దేవనాంపట్టినంలో ఉంటున్నారు. వీరి కుటుంబ గొడవల కేసు కోర్టు విచారణలో ఉంది. మంగళవారం రాత్రి ధనలక్ష్మి తన అక్క తమిళరసి ఇంటికి వచ్చారు. ఇంట్లో తమిళరసితో పాటు ఆమె అత్త సెల్వి, కుమార్తె హాసిని ఉన్నారు.
బుధవారం ఉదయం ప్రకాష్ యథావిధిగా పనికి వెళ్లాడు. అప్పుడు ధనలక్ష్మికి సద్గురు ఫోన్ చేసి గొడవపడ్డాడు. తరువాత సరాసరి ప్రకాష్ ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే ద్విచక్రవాహనంలోంచి పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వారిపై పోసి తలుపులు మూసి నిప్పంటించాడు. తర్వాత తనపై కుమ్మరించుకొని అంటించుకున్నాడు. తమిళరసి, పసిపాప హాసిని, సద్గురు, అతడి ఆరునెలల కుమారుడు చనిపోయారు. ధనలక్ష్మి, సెల్వి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
గురుగ్రంథ్ సాహిబ్లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.