గొడ్డలితో నరికాడు.. సంపులో పడేశాడు
‘మమ్మీని డాడీ సీసాతో కొట్టాడు. మొఖం మీద పొడిచాడు. తమ్ముడిని నీళ్ల ట్యాంకులో పడేశాడు’ అని తన కళ్ల ముందే తండ్రి చేసిన హత్యల తీరుపై రెండున్నరేళ్ల చిన్నారి భయపడుతూ చెప్పిన మాటలివి.
భార్య, నెలన్నర కుమారుడిని దారుణంగా హతమార్చిన వ్యక్తి
తండ్రి ఘాతుకాన్ని చూసి పారిపోయిన రెండున్నరేళ్ల కుమార్తె
అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లో ఘటన
అబ్దుల్లాపూర్మెట్, న్యూస్టుడే: ‘మమ్మీని డాడీ సీసాతో కొట్టాడు. మొఖం మీద పొడిచాడు. తమ్ముడిని నీళ్ల ట్యాంకులో పడేశాడు’ అని తన కళ్ల ముందే తండ్రి చేసిన హత్యల తీరుపై రెండున్నరేళ్ల చిన్నారి భయపడుతూ చెప్పిన మాటలివి. గొడ్డలి పట్టుకుని రాక్షసుడిగా ప్రవర్తిస్తున్న తండ్రిని చూసి గజగజ వణుకుతూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తిన ఆ బాలిక ప్రాణాలు దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం... అనాజ్పూర్ వాసి ఏర్పుల ధన్రాజ్కు అదే మండలంలోని బండరావిరాలకు చెందిన కందికంటి లావణ్య(23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె ఆద్య, నెలన్నర వయసున్న (ఫిబ్రవరి 3వ తేదీన జన్మించాడు) కుమారుడు క్రియాన్ష్ ఉన్నారు. ధన్రాజ్ తల్లి పదేళ్ల కిందటే మృతిచెందారు. ప్రస్తుతం వీరంతా తండ్రి బాలయ్యతో కలిసి ఉంటున్నారు. ఇటీవల కుమారుడు జన్మించగా 21వ రోజు వేడుకను ఘనంగా నిర్వహించిన ధన్రాజ్ ఇటీవలే భార్యను పుట్టింటికి పంపాడు. బుధవారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి బండరావిరాలకు వస్తున్నానని, కుమారుడికి నెలవారీ ఇంజెక్షన్ ఇప్పించాల్సి ఉందన్నాడు. 11 గంటలకు అత్తవారింటికి వెళ్లి భార్యతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు అనాజ్పూర్ చేరుకున్నారు. అనూహ్యంగా లావణ్యపై ధన్రాజ్ విరుచుకుపడ్డాడు. బీరు సీసాతో ముఖంపై పొడిచి, గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణం పోయింది. మంచం మీదున్న కుమారుడిని నీళ్ల సంపులోకి విసిరేశాడు.
భీతిల్లిన చిన్నారి
ఈ దారుణమంతా రెండున్నరేళ్ల వారి కుమార్తె ఆద్య కళ్ల ముందే జరిగింది. తండ్రిని చూసి భీతిల్లి ఏడుస్తూ బయటకు వచ్చేసింది. ఆమెను పక్కింటి బాలిక ఎత్తుకొని తమ ఇంట్లోకి తీసుకెళ్లింది. పట్టలేని ఆవేశంతో ఉన్న ధన్రాజ్ కుమార్తెను హతమార్చేందుకూ వెతికినా... ఆమె కనిపించలేదు. రక్తపు మరకలతో ఉన్న అతణ్ని ఇరుగుపొరుగు ప్రశ్నించారు. ఏమీ జరగలేదంటూ హెల్మెట్ పెట్టుకుని బైక్పై పరారయ్యాడు. వారికి అనుమానమిచ్చి ఇంట్లోకెళ్లి చూడగా లావణ్య రక్తపు మడుగులో కనిపించింది. బాలుడిని సంపులో నుంచి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు వచ్చి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఎందుకీ ఘాతుకం?
‘ఇప్పుడే వచ్చారు.. అంతలోనే ఇలా చేస్తాడనుకోలేదు’ అంటూ లావణ్య తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ధన్రాజ్ ఎందుకీ హత్యలు చేశాడో తెలియడం లేదని చుట్టుపక్కల వారూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. దంపతులు అన్యోన్యంగా మెలిగేవారని, గొడవలు పడినట్లు చూడలేదని తెలిపారు. ఘటనా స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ స్వామితో కలిసి పరిశీలించారు. నిందితుడిని 24 గంటల్లోగా అరెస్టు చేస్తామన్నారు. అదనపు కట్నం కోసమే ఇలా చేశాడని లావణ్య తండ్రి ఫిర్యాదు ఇచ్చారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది కిలోల బంగారం స్వాధీనం
ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. -
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?