గొయ్యిలో పడిన బస్సు.. ఛత్తీస్‌గఢ్‌లో 15 మంది దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటలకు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది.

Updated : 10 Apr 2024 07:18 IST

దుర్గ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటలకు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఈ ఘటనలో ప్రమాదస్థలంలో 11 మంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. 12 మందికిపైగా గాయపడ్డారు. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు కుమ్హారీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖాప్రీ గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో పడినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని