Girl Kidnap: బాలిక కిడ్నాప్.. రూ.10 లక్షల డిమాండ్
ఆరేళ్ల బాలిక కిడ్నాప్ అంశం సుఖాంతమైంది. పోలీసుల విస్త్రృత తనిఖీలు చేయడంతో భయపడిన కిడ్నాపర్లు ఆమెను ఓ గ్రౌండ్లో వదిలేసి పరారయ్యారు.
కొల్లాం: ఆరేళ్ల బాలిక కిడ్నాప్ (Girl Kidnap in Kerala) ఘటనలో 21 గంటల తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. సోమవారం సాయంత్రం నుంచి కేరళ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కిడ్నాపర్లు.. కొల్లాం ఆశ్రమం గ్రౌండ్లో బాలికను వదిలపెట్టి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల సమయంలో కొల్లాంలోని (Kollam) పోయప్పల్లిలో ట్యూషన్కు వెళ్తున్న బాలికను దుండగులు అపహరించారు. ఆమె పక్కనే ఉన్న 8 ఏళ్ల సోదరుడు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పక్కకి విసిరేయడంతో కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఆ బాలుడు జరిగిన విషయాన్ని ఇంటికొచ్చి తన తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడికి నిమిషాల వ్యవధిలోనే దుండగులు వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని లేదంటే.. చిన్నారి ప్రాణాలు తీస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని హెచ్చరించారు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు గంటల కొద్దీ గాలింపు చర్యలు చేపట్టినా.. ఫలితం లేకపోయింది. ఈలోగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొందరు యువకులు పోయప్పల్లి పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కొల్లాం, పథనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో విస్త్రృతంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు కిడ్నాపర్లు, బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన ఫోన్కాల్స్ కూడా స్థానిక ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. దీంతో భయపడిన కిడ్నాపర్లు బాలికను కొల్లాం ఆశ్రమం గ్రౌండ్లో వదిలేసి వెళ్లిపోయారు.
బాధిత బాలిక సోదరుడు చెప్పిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు తెల్లరంగు కారులో వచ్చి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. బాలుడు చెప్పిన వివరాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రులు రెండు వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా పని చేస్తున్నారు. బాలికను కిడ్నాప్ చేయడానికి గల కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
యూపీలో ఓ భర్త పట్ల భార్య కిరాతకంగా వ్యవహరించింది. సిగరెట్లతో వాతలు పెడుతూ భర్తకు నరకం చూపింది. -
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో మహిళ మృతదేహం బయటపడడంతో యూనివర్సిటీలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. -
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం