Crime News: వివాహితపై ఇన్స్పెక్టర్ అత్యాచారం.. రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు
వివాహిత కణతపై తుపాకి గురిపెట్టి అత్యాచారం చేసిన మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరావు కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక...
హైదరాబాద్: టాస్క్ఫోర్స్ విభాగంలో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు కీలకమైన కేసులను ఛేదించగలిగే అధికారిగా పేరుంది.. ఉత్తరమండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా ఏడేళ్లు పనిచేసిన ఆయన ఎన్నో కీలకమైన కేసులు పరిష్కరించారు. ఉగ్రవాదుల నెట్వర్క్ను గుర్తించారు.. మాదకద్రవ్యాల స్మగ్లర్లనూ పట్టుకున్నారు. పరారీలో ఉన్న ఎంతోమంది కరడుగట్టిన నేరగాళ్లను పట్టుకొచ్చిన నాగేశ్వరరావు ఇప్పుడు అత్యాచారం కేసులో కటకటాల పాలయ్యారు. వివాహిత కణతపై తుపాకి గురిపెట్టి అత్యాచారం చేసిన మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరావు కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. అత్యాచారం, అపహరణ, హత్యాయత్నం, ఆయుధ నిరోధక చట్టం కింద ఆయనపై వనస్థలిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం రికార్డు చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. నాగేశ్వరరావును బాధితురాలి భర్త కొట్టిన కర్ర, అత్యాచార సమయంలో బాధితురాలి దుస్తులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు, ఆమె భర్తను కారులో తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు.
బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ షాపులోని సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ఇబ్రహీంపట్నం మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నాగేశ్వరరావు కారు వెళ్లినట్టు రికార్డయింది. దీంతో సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు వాడిన కారును, బాధితురాలి సెల్ఫోన్ను సీజ్ చేశారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని, అమె భర్తను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు.. తాను ఆక్టోపస్ అధికారినని, కానిస్టేబుల్తో కలిసి వెళ్తుండగా కారు ప్రమాదం జరిగిందని నాగేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చాడు. కారు ప్రమాదంపై అతని వద్ద పనిచేసే హోం గార్డుకు సమాచారం ఇవ్వడంతో అతను ట్రోయింగ్ వాహనం ద్వారా కారును చంపాపేట్కు తరలించాడు. హోంగార్డ్ ప్రవీణ్ స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు.
అత్యాచారం ఘటన తర్వాత నాగేశ్వరరావు తన బట్టలు స్వయంగా ఉతుక్కున్నాడని, ఏమీ తెలియనట్టు మారేడ్పల్లి పీఎస్కు వెళ్లి విధులు నిర్వహించినట్ట పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మారేడ్పల్లి ఠాణాలోనే రివాల్వర్ ఉంచి బెంగళూరుకు పరారయ్యాడు. కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీలో అతని నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు... అత్యాచార సమయంలో వాడిన ప్యాంటు, షర్టు, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కొవిడ్, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్నగర్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు