Crime news: యువతిని రేప్ చేసి.. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టి..!
ఓ యువతిపై జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. .......
పంజాబ్లో ఓ యువకుడి అరెస్టు
హోషియార్పూర్: పంజాబ్లో ఓ యువతిపై జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించిన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో కొన్ని నెలల క్రితం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో యువతితో స్నేహం ఏర్పరచుకున్న 22 ఏళ్ల విశాల్ చౌధరి అనే యువకుడు.. ఏదో సాకుచెప్పి ఆమెను తన ఇంటికి పిలిచి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు వివరించారు. చబ్బేవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుందన్నారు. గతేడాది ఆమెను తన ఇంటికి పిలిచిన విశాల్ చౌధరి (22ఏళ్లు) ఆమెకు మత్తుమందు కలిపిన శీతలపానియం ఇచ్చాడనీ.. యువతి స్పహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసి వీడియో రికార్డు చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత ఆమెను తరచూ బ్లాక్మెయిల్ చేసి వీడియో వైరల్ చేస్తానంటూ బెదిరించేవాడన్నారు. ఇటీవల అతడి కోరికను యువతి నిరాకరించడంతో వీడియోను సోషల్మీడియాలో సర్క్యులేట్ చేసి వైరల్ చేశాడని తెలిపారు. దీంతో తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
హోటల్లో యువతిపై సామూహిక అత్యాచారం
గ్వాలియర్: మధ్యప్రదేశ్లో మరో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు వ్యక్తులు గ్వాలియర్లోని ఓ హోటల్లో యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బుధవారం రాత్రి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ లైంగిక దాడి జరిగినట్టు గ్వాలియర్ డీఎస్పీ విజయ్ సింగ్ భదౌరియా తెలిపారు. భోపాల్కు చెందిన యువతి (22 ఏళ్లు) తన ఫ్రెండ్తో కలిసి గ్వాలియర్లోని ఓ హోటల్కు పార్టీకి వెళ్లిందన్నారు. పార్టీ అయిపోయిన తర్వాత ఆమెపై ఇద్దరు వ్యక్తులుదాడి చేసి హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
యూపీలో ఓ భర్త పట్ల భార్య కిరాతకంగా వ్యవహరించింది. సిగరెట్లతో వాతలు పెడుతూ భర్తకు నరకం చూపింది. -
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో మహిళ మృతదేహం బయటపడడంతో యూనివర్సిటీలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. -
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి