Crime news: భర్త మరణవార్త విని.. పసిబిడ్డను చంపి, ఆత్మహత్య చేసుకున్న భార్య

కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మృతిచెందాడన్న బాధతో ఆరు నెలల కుమారుడిని చంపిన ఓ మహిళ.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది......

Published : 18 Apr 2022 02:06 IST

బెంగళూరు: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మృతిచెందాడన్న బాధతో ఆరు నెలల కుమారుడిని చంపిన ఓ మహిళ.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. రాయ్‌చూర్‌కు చెందిన గంగాధర్​ బి కమ్మర(36), శ్రుతి(30) భార్యాభర్తలు. వీరికి ఆరు నెలల కుమారుడు అభిరామ్​ ఉన్నాడు. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గంగాధర్ మరణించాడు. కుంటికాన సమీపంలో రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి కుందాపుర్ వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

భర్త మృతిచెందిన విషయం రాయచూర్‌లో ఉన్న భార్య శ్రుతికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్​కు గురైన ఆమె.. భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఆ రాత్రి 10 గంటల సమయంలో తన ఆరు నెలల కుమారుడు అభిరామ్​ను హత్యచేసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మంగళూరు సిటీ పోలీసు కమిషనర్‌ ఎన్‌ శశికుమార్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని