Crime News: హైదరాబాద్లో మరో అఘాయిత్యం.. కార్ఖానా పోలీసులు ఏమన్నారంటే..
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్ పరిధిలో మైనర్పై సామూహిక అత్యచార ఘటన ఆలస్యంగా
సికింద్రాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్ పరిధి కార్ఖానాలో ఓ మైనర్పై ఐదుగురు అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికపై గ్యాంగ్రేప్ జరిగినట్లు వార్తలు రాగా పోలీసులు దాన్ని ఖండించారు. తమకందిన ఫిర్యాదు మేరకు ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో మైనర్లు మినహా మిగతా వారిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. బాలికతో నిందితులు ధీరజ్, రితేశ్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నారు. అత్యాచారం చేసే సమయంలో వారిద్దరూ వీడియోలు తీసి బాలికను భయపెట్టారు. వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి స్నేహితులతో కలిసి దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పరిస్థితి చూసి ఆమె కుటుంబసభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడి వద్ద బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు: పోలీసులు
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ‘‘స్నేహం పేరుతో బాలికను మభ్యపెట్టిన నిందితులు.. లైంగిక వాంఛ తీర్చుకున్నారు. బాలికపై లాడ్జిలో వేర్వేరు రోజుల్లో లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో గత నెల 30న వారిపై కేసు నమోదు చేశాం. బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ముగ్గురు యువకులు ఉన్నారు’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.