Crime News: గుంటూరు జిల్లాలో దారుణం.. రెండు రోజుల పసిపాపను హత్య చేసిన కన్నతల్లి

గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణ ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల పసిపాపను కన్నతల్లే చంపేసింది.

Published : 10 Dec 2021 01:39 IST

తాడికొండ: గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణ ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల పసిపాపను కన్నతల్లే చంపేసింది. ఆడపిల్ల పుట్టిందని బొంత లక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. బిడ్డను చంపేసిన తర్వాత.. ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావడానికి ముందే  పాప మృతదేహాన్ని తల్లిదండ్రులు పూడ్చిపెట్టేశారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తెను చంపేసిన దంపతులకు.. గతంలోనే ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Read latest Crime News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని