Gun Fire: అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మేరీల్యాండ్‌ నగరంలో సాఫ్గవేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నల్గొండ యువకుడిపై  ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.

Updated : 22 Jun 2022 12:28 IST

నల్గొండ: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మేరీల్యాండ్‌ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నల్గొండ యువకుడిపై  ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నల్గొండ వాసి నక్క సాయి చరణ్‌(26) మృతి చెందాడు. యువకుడిపై ఆదివారం కాల్పులు జరపగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయి మృతితో నల్గొండలో విషాదఛాయలు అలముకున్నాయి. సాయిచరణ్‌ అమెరికాలో రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని