బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మృతుడి వద్ద వజ్రాలు పొదిగిన 47 బంగారు అభరణాలు
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో బస్సులోనే మృతిచెందాడు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలోని కొరిశపాడు సమీపంలో ఆదివారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడి వద్ద సుమారు రూ.కోటి విలువైన వజ్రాలు పొదిగిన 47 బంగారు అభరణాలను పోలీసులు గుర్తించారు.
గుంటూరు (మేదరమెట్ల): ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో బస్సులోనే మృతిచెందాడు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలోని కొరిశపాడు సమీపంలో ఆదివారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. మేదరమెట్ల ఎస్సై ఎంవీ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం గ్రామానికి చెందిన బొబ్బా పవన్కుమార్(41) మూడు నెలల నుంచి గుంటూరులోని కిస్నా జ్యువెల్లర్స్లో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఒంగోలులోని బీఎంఆర్ జ్యువెల్లర్స్ దుకాణంలో ఆభరాణాలు చూపించి తిరిగి గుంటూరు వెళ్లేందుకు కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు కొరిశపాడు జాతీయ రహదారి వంతెన దాటే సమయంతో అతడికి ఛాతీనొప్పి రావడంతో పక్కన కూర్చున్న ప్రయాణికుడు బస్సు డ్రైవర్కు సమాచారం ఇచ్చాడు. డ్రైవర్ వెంటనే 108కి సమాచారం అందించాడు. 108 వాహనం వచ్చేలోపే పవన్కుమార్ మృతిచెందాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న మేదరమెట్ల ఎస్సై.. మృతుని సెల్ఫోన్ను అన్లాక్ చేసి అందులో ఉన్న నంబర్ల ఆధారంగా వారికి ఫోన్ చేసి మృతుని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి బ్యాగును పరిశీలించగా అందులో వజ్రాలు పొదిగిన 47 బంగారు అభరణాలను పోలీసులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతుడు పనిచేస్తున్న కిస్నా జ్యువెల్లర్స్ యజమానులకు ఎస్సై సమాచారం అందించారు. కిస్నా జ్యువెల్లర్స్ ప్రతినిధులు హితేష్మెహతా, సుధీర్ ఆభరణాలకు సంబంధించిన రశీదులను పోలీసులకు చూపించారు. వాటిని పరిశీలించిన ఎస్సై స్థానిక గ్రామ పెద్దల సమక్షంలో ఆభరణాలను జ్యువెల్లర్స్ ప్రతినిధులకు అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటంబసభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
యూపీలో ఓ భర్త పట్ల భార్య కిరాతకంగా వ్యవహరించింది. సిగరెట్లతో వాతలు పెడుతూ భర్తకు నరకం చూపింది. -
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో మహిళ మృతదేహం బయటపడడంతో యూనివర్సిటీలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. -
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!