UP: గ్యాంగ్స్టర్ తరలింపులో ఉత్కంఠ.. ఆవును ఢీకొన్న కాన్వాయ్..!
ఉత్తర్ప్రదేశ్కు (Uttar Pradesh) చెందిన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ను (Atiq Ahmed) గుజరాత్ జైలు నుంచి ప్రయాగ్రాజ్ జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు వెళ్తోన్న వాహనం ఓ ఆవును ఢీ కొట్టడం కలకలం రేపింది.
దిల్లీ: వందకుపైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ను (Atiq Ahmed) గుజరాత్లోని సబర్మతి కేంద్ర కారాగారం నుంచి ఉత్తర్ప్రదేశ్లోని (UP) ప్రయాగ్రాజ్కు యూపీ పోలీసులు తరలిస్తున్నారు. ఇదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని.. పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్లో చంపేస్తారని భయపడుతూ జైలు నుంచి బయటకు వచ్చేందుకు నిందితుడు అతీక్ (Atiq Ahmed) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని తీసుకెళ్తున్న పోలీస్ కాన్వాయ్కు మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లాలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. వాహన శ్రేణికి ఓ ఆవు అడ్డురావడంతో అతీక్ ప్రయాణిస్తోన్న వాహనం దాన్ని ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపు కాన్వాయ్ను అక్కడే నిలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఓ కిడ్నాప్ కేసులో తీర్పు వెలువడనున్న సందర్భంగా ఈ నెల 28న ప్రయాగ్రాజ్ న్యాయస్థానంలో నిందితుడిగా అహ్మద్ను హాజరుపరచాల్సి ఉంది. దీంతో గుజరాత్ నుంచి ప్రయాగ్రాజ్కు తరలిస్తున్నారు. అయితే, కోర్టులో హాజరుపరిచే నెపంతో తనను పోలీసులు తీసుకువెళ్తున్నారని, ప్రయాగ్రాజ్కు వెళ్లే దారిలోనే తనను హతమార్చే అవకాశం ఉందని అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశాడు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలోనూ హత్య, హత్య అంటూ విలేకరుల ముందు భయంతో కేకలు వేశాడు. ఈ క్రమంలోనే అతడి వాహన శ్రేణి ప్రమాదానికి గురికావడం కలకలం రేపింది. వాహనం ఢీకొట్టడంతో ఆ మూగజీవి రోడ్డు డివైడర్పై పడిపోవడంతో అది మరణించి ఉండవచ్చని భావించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత అది లేచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఇలా నిందితుడికి ఎన్కౌంటర్ భయం నెలకొన్న వేళ.. న్యాయస్థానంలో వచ్చే అన్ని తీర్పులను అంగీకరిస్తామని ఆయన సోదరి అయేషా నూరీ వెల్లడించారు. కేవలం ఆయన ప్రాణాలపైనే ఆందోళన చెందుతున్నామన్నారు. గుజరాత్ నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్కు వెళ్తోన్న పోలీసు కాన్వాయ్ను అయేషా నూరీ అనుసరిస్తున్నారు. 45 మంది పోలీసుల బృందంతో కూడిన కాన్వాయ్ నిందితుడిని తరలిస్తోంది. సుమారు 25 గంటల ప్రయాణం అనంతరం సోమవారం సాయంత్రం ఈ కాన్వాయ్ ప్రయాగ్రాజ్కు చేరుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్