Hyderabad: పుడింగ్‌ పబ్‌ కేసు.. అభిషేక్‌కు బెయిల్‌ మంజూరు

పుడింగ్‌ అండ్ మింక్‌ పబ్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అభిషేక్ బయటికి వచ్చారు

Published : 11 May 2022 02:01 IST

హైదరాబాద్‌: పుడింగ్‌ అండ్ మింక్‌ పబ్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అభిషేక్ బయటికి వచ్చారు. ప్రతి రెండు ఆదివారాలకు ఒకసారి బంజారాహిల్స్ పోలీసుల ఎదుట అభిషేక్‌ హాజరవ్వాలని కోర్టు షరతు విధించింది. ఇదే కేసులో A1గా ఉన్న పబ్ మేనేజర్ అనిల్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది.

గత నెల 3వ తేదీన తెల్లవారుజూమున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పుడింగ్‌ పబ్‌పై దాడి చేశారు. పబ్‌లో 4.6 గ్రాముల కొకైన్ లభించడంతో పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి పబ్ యజమాని అభిషేక్‌తో పాటు, మేనేజర్ అనిల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరినీ ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు మరికొంత మందిని విచారించారు. విచారణ పూర్తి అయినందున బెయిల్ ఇవ్వాలని నిందితులు నాంపల్లి కోర్టులో గత నెల 21న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిందితులు.. బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. అభిషేక్‌కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. అనిల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని