POCSO: పైశాచికం..చెట్టుకు కట్టేసి..బలవంతంగా మూత్రం తాగించి!
రాజస్థాన్ (Rajasthan)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రాత్రి పూట బాలికను కలవాలని వచ్చాడన్న కారణంతో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. బలవంతంగా మూత్రం(Urine) తాగించారు.
జోద్పూర్: బాలికను కలిసేందుకు రాత్రి పూట పక్క ఊరి నుంచి వచ్చాడన్న కారణంతో ఓ యువకుడిని అర్ధనగ్నంగా (half nake) చెట్టుకు కట్టేసి చావబాదారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా మూత్రం తాగించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ (Rajasthan)లోని జాలోర్ (Jalore)లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలికను కలిసేందుకు సమీప గ్రామం నుంచి ఓ యువకుడు ఆదివారం రాత్రి వచ్చాడు. అది గమనించిన బాలిక బంధువులు అతడిని బంధించి చెట్టుకు కట్టేశారు. వద్దని మొరపెట్టుకుంటున్నావినకుండా చర్మం చిట్లేలా కొట్టారు. అతడిపై మూత్రం పోశారు. అక్కడితో ఆగకుండా ఓ సీసాలో మూత్రం నింపి బలవంతంగా తాగించారు.
ఈలోగా విషయం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు.యువకుడిని విడిచిపెట్టాలని ఎంత ప్రాధేయపడినా వినలేదు. చివరికి గ్రామపెద్దలు కలగజేసుకొని ఇరువర్గాలవారినీ అక్కడి నుంచి పంపించేశారు. అయితే, ఘటనకు సంబంధించి తొలుత ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోమవారం నాటికి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడి ఇంటికి వెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరోవైపు బాలిక ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె నుంచి వివరాలు సేకరించినట్లు చెప్పారు. బాధితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక