Crime News: మత్తులో మదమెక్కి ఆవుపై అత్యాచారం.. మృతి చెందిన మూగజీవి

గంజాయి మత్తులో మదమెక్కి.. మతితప్పి, మానవత్వం మరచిన కొందరు పైశాచికంగా ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ మూగజీవి తనువు చాలించింది.

Updated : 13 Jan 2023 09:33 IST

యానాం, న్యూస్‌టుడే: గంజాయి మత్తులో మదమెక్కి.. మతితప్పి, మానవత్వం మరచిన కొందరు పైశాచికంగా ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ మూగజీవి తనువు చాలించింది. యానాంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పొగాకు ఈశ్వరరావు అనే రైతుకు చెందిన ఆవు నాలుగు కాళ్లను, మెడను తాళ్లతో కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ చోటులో గంజాయి తాగిన ఆనవాళ్లున్నాయి. గురువారం తెల్లవారు జామున కొబ్బరితోటకు వెళ్లిన ఈశ్వరరావుకు ఆవు చనిపోయి ఉండటం కనిపించింది. ఆయన యానాం పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ పెంచాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఊపిరాడక పోవడంతో ఆవు మృతి చెంది ఉంటుందని పుదుచ్చేరి పశు వైద్యాధికారి కదిరేశన్‌ తెలిపారు. జంతువుతో లైంగిక చర్యకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని