Road Accident: లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

Published : 17 Feb 2023 10:28 IST

ఆర్మూర్‌ పట్టణం: నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా ఆర్మూర్‌ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బస్సు 38 మంది ప్రయాణికులతో రాయచూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్‌ బాబు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని