Road Accident: ఆటో-బస్సు ఢీ.. నలుగురు మహిళా కార్మికులు మృతి

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో ఆటో-బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళా కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 16 Feb 2023 12:12 IST

చౌటుప్పల్‌ గ్రామీణం: యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో ఆటో-బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళా కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని మరో 8 మంది ప్రయాణికులకూ గాయాలయ్యాయి. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి వెళ్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మహిళా కార్మికులు మృతిచెందారు. మృతులను డాకోజి నాగలక్ష్మి (28), వరకాంతం అనసూయ(55), సిలివేరు ధనలక్ష్మి (35), దేవరపల్లి శిరీష(30)గా గుర్తించారు. మృతులంతా ఓ పచ్చళ్ల పరిశ్రమలో ఉపాధి పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సీఐ మల్లికార్జున్‌ రెడ్డి, ఎస్సై సీతాపాండు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని