Accident: మద్యం మత్తులో డ్రైవర్‌.. స్కూల్‌ బస్సు బోల్తా పడి ఆరుగురు చిన్నారుల మృతి

Accident: డ్రైవర్‌ మద్యం మత్తులో నడపడంతో ఓ స్కూల్‌ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 11 Apr 2024 11:58 IST

చండీగఢ్‌: హరియాణా (Haryana)లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకొంది. మహేంద్రగఢ్‌ జిల్లాలో గురువారం ఉదయం స్కూల్‌ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు (School Bus) బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.

నేడు రంజాన్ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ కనైనా ప్రాంతంలో ఓ స్కూల్‌ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఘటన సమయంలో డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. హరియాణా విద్యాశాఖ మంత్రి సీమా ట్రిఖా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన బస్సు  ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ 2018లోనే గడువు ముగిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని