Andhra News: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం: లారీ, కారు ఢీకొని 8మంది మృతి

ఏపీలోని అల్లూరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీ, కారు ఢీకొన్నాయి.

Updated : 22 Nov 2022 21:21 IST

చింతూరు: ఏపీలోని అల్లూరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం బొడ్డగూడెం వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8మంది  మృతి చెందారు. బాధితులు ఛత్తీస్‌గఢ్‌ నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారులో ఉన్న మరో ఇద్దరికి  తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు ఛత్తీస్‌గఢ్‌ వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని