Crime News: యాదాద్రి జిల్లాలో దారుణం.. విషాహారం తిని 60 వీధి కుక్కలు మృతి

వీధి కుక్కలకు విషాహారం పెట్టి చంపిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో చోటు చేసుకుంది.

Published : 08 Jul 2023 21:12 IST

వలిగొండ: వీధి కుక్కలకు విషాహారం పెట్టి చంపిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని కొందరు వ్యక్తులు వీధి కుక్కలకు విషాహారం పెట్టారు. అవి చనిపోయే వరకు వేచి చూసి.. వాటన్నంటిని ట్రాక్టర్‌లో తీసుకెళ్లి గ్రామ శివారులో గొయ్యితీసి పాతి పెట్టారు. సుమారు 60కి పైగా శునకాలు మృత్యువాత పడ్డాయి. శునకాలకు విషాహారం పెట్టడం పట్ల జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శునకాలు ఎక్కువగా ఉంటే వాటిని పట్టుకొని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయాలని కానీ, ఇలా విషాహారం పెట్టి చంపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని