కెనడాలో తెలంగాణ విద్యార్థి మృతి

కెనడా వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం

Published : 10 Nov 2020 01:42 IST

వనస్థలిపురం: కెనడా వెళ్లిన తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఫేజ్‌-4లో నివాసముంటున్న శ్రీకాంత్‌, హరిప్రియ దంపతుల కుమారుడైన  అఖిల్‌(19) గతేడాది హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ చేసేందుకు కెనడా వెళ్లాడు. కరోనాకు ముందు భారత్‌ వచ్చిన అఖిల్‌ తిరిగి అక్టోబర్‌ 5న కెనడాకు వెళ్లాడు. అక్కడ తను నివాసముంటున్న భవనంలోని 27వ అంతస్తుపై చరవాణిలో మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అఖిల్‌ మరణవార్తతో వనస్థలిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అఖిల్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అఖిల్‌ ఇద్దరి సంతానంలో రెండోవాడు. కుమారుడిమృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని