Crime News: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం

నెల్లూరు జిల్లా సంగం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వాగులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో

Updated : 10 Dec 2021 10:46 IST

సంగం: నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం సమీపంలోని బీరాపేరు వాగులో ఆటో కొట్టుకు పోయిన ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం... ఆత్మకూరు నుంచి సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయల్దేరారు. సంగం సమీపంలోని బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. పోలీసులు, రహదారిపై వెళ్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఏడుగురిని వాగులోంచి కాపాడారు. గల్లంతైన ఐదుగురికోసం గాలింపు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకమేర్పడింది. వాగులోంచి స్థానికులు కాపాడిన ఏడుగురిలో బాలిక చనిపోయింది.  

ఐదుగురి కోసం గాలిస్తున్నాం: ఎస్పీ విజయారావు

సంగం వద్ద జరిగిన ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ విజయారావు స్పందించారు. స్థానికుల సహకారంతో ఏడుగురిని కాపాడామని, గల్లంతైమన ఐదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. బోట్లు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలి వద్ద పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని