TS News: విద్యుదాఘాతంతో దంపతుల మృతి

సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం వెండికోల్‌ గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో శ్రీనివాస్‌, దేవి దంపతులు..

Published : 20 Dec 2021 01:03 IST

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం వెండికోల్‌ గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో శ్రీనివాస్‌, దేవి దంపతులు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న పొలంలో విద్యుదాఘాతంతో దంపతులిద్దరూ చనిపోగా.. నిన్న సాయంత్రం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను విశాఖ జిల్లా వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని