Disha Encounter case: ‘మాకు న్యాయం చేయండి’: సిర్పూర్కర్ కమిషన్ను కోరిన హుస్సేన్
దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో కుమారుడిని కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ఆరిఫ్ తండ్రి హుస్సేన్.. సిర్పూర్కర్ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం కోసమే
హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో కుమారుడిని కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ఆరిఫ్ తండ్రి హుస్సేన్.. సిర్పూర్కర్ కమిషన్కు విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం కోసమే అఫిడవిట్ దాఖలు చేశారా? అని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు.. న్యాయం కోసమే కమిషన్ను ఆశ్రయించినట్లు హుస్సేన్ తెలిపారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ విచారణ నిర్వహించింది. ఈ నెల 1న మొదలైన మలి విడత విచారణ శనివారం వరకు కొనసాగింది. సిట్ అధికారి సురేందర్ రెడ్డితో పాటు సాక్షిగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగి రాజశేఖర్ను కమిషన్ను ప్రశ్నించింది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు హుస్సేన్ను ప్రభుత్వ తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
న్యాయవాది ఉమామహేశ్వర్ రావు అడిగిన పలు ప్రశ్నలకు హుస్సేన్ చెప్పిన సమాధానాలను కమిషన్ నమోదు చేసుకుంది. ఈ నెల 13 నుంచి 17 వరకు మరోసారి విచారణ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఆరిఫ్ తండ్రి హుస్సేన్ నుంచి మాత్రమే కమిషన్ వాంగ్మూలం తీసుకుంది. మిగతా ముగ్గురు మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు నేతృత్వం వహించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఈ రోజు కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను కమిషన్ విచారించాల్సి ఉంది. కానీ, మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకోవడం పూర్తి కాకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. ఈ నెల 13 తర్వాత మహేశ్ భగవత్ను కమిషన్ విచారించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!