Family Suicide: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబం బలవన్మరణం
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలహాలతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి
సంగారెడ్డి పట్టణం: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలహాలతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్ (38), లావణ్య (32) భార్యాభర్తలు. వీరికి ప్రథమ్(6), సర్వజ్ఞ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రకాంత్ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్ శివారు బీహెచ్ఈఎల్లో నివాసముంటున్నారు. అక్కడికి సమీపంలోని బాంబే కాలనీలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనికోసం లావణ్య తల్లిదండ్రులు రూ.40లక్షలు సహాయం చేశారు. చంద్రకాంత్కు వచ్చే జీతం మొత్తం ఇంటి నిర్మాణ పనులకే ఖర్చువుతుండటంతో ఇల్లు గడిచేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఎంతో కొంత సహాయం చేయాలని తన తల్లిదండ్రులను చంద్రకాంత్ కోరగా.. అందుకు వారు నిరాకరించారు.
కాగా.. గురువారం సాయంత్రం కుటుంబసభ్యుల గృహప్రవేశానికి చంద్రకాంత్ దంపతులు వెళ్లొచ్చారు. అనంతరం చంద్రకాంత్ తన తల్లిదండ్రులతో ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. రోజూ దీనిపై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన లావణ్య.. పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం, గొడవల నేపథ్యంలో చంద్రకాంత్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బయటకు వెళ్లిపోయిన లావణ్య.. కాసేపటికి అనుమానం వచ్చి పక్కింటికి ఫోన్ చేయగా భర్త చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసింది. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. ఇద్దరి పిల్లలతో సహా అందోల్ పెద్ద చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఉదయం చెరువులో మృతదేహాలు తేలియాడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లావణ్యతో పాటు పిల్లల మృతదేహాలకు బయటకు తీశారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.