Telugu Akademi Scam: కుంభకోణంలో సాయికుమార్ కీలక నిందితుడు: అంజనీకుమార్
తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాడమీ అకౌంట్స్ అధికారి రమేశ్కు అక్రమాలకు పాల్పడిన ముఠాతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. గతంలో కొందరిని అరెస్టు చేశామన్నారు. మరో 9 మందిని అనుమానితులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని వివరించారు. ‘‘మొత్తం రూ.64.5 కోట్ల నిధులు గోల్మాల్ చేశారు. కార్వాన్లోని యూనియన్ బ్యాంక్ నుంచి 26కోట్లు, రూ.11 కోట్లు సంతోష్ నగర్, చందనగర్ కెనరా బ్యాంక్లోని రూ. 6 కోట్లు కొల్లగొట్టారు. ఈ కుంభకోణంలో సాయికుమార్ కీలక నిందితుడు. ఇతనిపై గతంలో 3 కేసులున్నాయి’’ అని అంజనీకుమార్ తెలిపారు. కాగా, ఇవాళ సీసీఎస్ పోలీసులు బ్యాంకు ఏజెంట్లు సాయికుమార్, రాజ్కుమార్, వెంకట్తో పాటు చందానగర్ కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే ఫిక్స్డ్ డిపాజిట్లను ముఠా మళ్లించినట్లు తేల్చారు.
ఒప్పందం ప్రకారం పంచుకున్నారు..
‘‘డబ్బులన్నీ ఆగ్రసేన్ బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీ ఖాతాలోకి వెళ్లాయి. అకాడమీ సభ్యుల లాగా ఆగ్రసేన్ బ్యాంక్లో ఖాతాలు తెలిచారు. సాయి కుమార్కి ఈ డబ్బులో అధిక శాతం వెళ్లాయి. మిగిలిన వారు ఒప్పందం ప్రకారం పంచుకున్నారు. కొంత నగదును ఖాతాల్లో నిలుపుదల చేశాం. పంచుకున్న డబ్బులతో నిందితులు ఆస్తులు కొన్నారు. కొంతమంది అప్పులు ఇచ్చారు. మార్కంటైల్ బ్యాంక్కు 10శాతం కమిషన్ వెళ్లింది’’ అని సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు