Hyd Crime News: రహస్య పెళ్లిని బహిర్గతం చేయాలన్న ఒత్తిడితోనే..
హైదరాబాద్ మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్లో ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న చోటుచేసుకుంది.
మాదాపూర్: మాదాపూర్ పీఎస్ పరిధిలోని లెమెన్ ట్రీ హోటల్లో జరిగిన జంట మరణాల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం కారణంగానే యువతిని హత్య చేసి ఆ తర్వాత యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కోస్గి మండలం లగచర్లకు చెందిన సంతోషను, బోంరాస్ పేట మండలం హకీంపేటకు చెందిన రాములు బ్లేడ్తో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత యువతి చున్నీతో రాములు ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై హోటల్ సిబ్బంది మాదాపూర్ పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు వివరాలను మాదాపూర్ సీఐ రవీందర్ మీడియాకు వెల్లడించారు.
సంతోష, రాములు పదో తరగతి వరకు బోంరాస్ పేట మండలం హకీంపేటలో చదువుకున్నారు. సంతోష ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమవుతూ గత ఐదేళ్లుగా హైదరాబాద్లో ఉంటోంది. కారు డ్రైవింగ్ చేస్తున్న రాములు కూడా మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చాక ఇరువురు కలుసుకున్నారు. వీరి ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లింది. సంతోషను పెళ్లి చేసుకుంటానని.. రాములు తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ కులాంతర వివాహానికి రాములు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. సంతోష ఇంట్లో మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో నెల క్రితం రాములు, సంతోషను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వీరు పెళ్లి చేసుకున్నట్లు కుటుంబసభ్యులు, గ్రామస్థులకు తెలీదు. దీంతో పెళ్లి గురించి అందరికీ చెప్పాలని సంతోష.. రాములుపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లకు పెళ్లి గురించి చెప్పలేక రాములు ఒత్తిడికి గురయ్యాడు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం రాములు, సంతోష కలిసి లెమెన్ ట్రీ హోటల్లో దిగారు. 29వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సంతోషను గొంతు కోసి రాములు హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ వివరించారు.
రాములు తన ప్రేమ పెళ్లి గురించి నెల క్రితమే ఇంట్లో చెప్పాడని మృతుడి సోదరుడు సాయి తెలిపాడు. అమ్మాయిది వేరే కులం కావడంతో తమ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పాడు. అయితే, గత రెండు రోజుల నుంచి తన అన్న రాములు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని, మంగళవారం ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడాడని సాయి తెలిపాడు. ఫోన్ పోయినట్టుగా తమకు చెప్పాడన్నారు. అయితే వీరు పెళ్లి చేసుకున్నట్లు తమకు తెలీదన్నారు. తన అన్న చాలా మంచివాడని.. ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ సాయి కన్నీరు మున్నీరుగా విలపించాడు.
రాములుని పెళ్లి చేసుకుంటానని సంతోషి నెల రోజుల క్రితమే ఇంట్లో చెప్పిందని మృతురాలి సోదరుడు రాఘవేందర్ తెలిపాడు. ఇరువురి కులాలు వేరయినప్పటికీ పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్పాడు. అయితే, రాములు కుటుంబం ఒప్పుకోలేదన్నారు. కులాంతర వివాహం వద్దని చెప్పారన్నారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని రాఘవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!