ఫోన్‌ మాట్లాడుతూ భవనంపై నుంచి పడ్డాడు

సోదరుడితో వీడియోకాల్‌ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు రెండో అంతస్తు నుంచి కిందపడ్డాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన

Updated : 18 Jul 2021 00:15 IST

హైదరాబాద్‌: సోదరుడితో వీడియోకాల్‌ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు రెండో అంతస్తు నుంచి కిందపడ్డాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మణికొండలో నివాసముండే తాళ్ళూరి శ్యామ్యూల్ సుజిత్(32) ఈరోజు ఉదయం తన సోదరుడితో ఫోన్‌లో వీడియోకాల్ మాట్లాడుతుండగా రెండో అంతస్తు బాల్కనీ నుంచి జారీ పడ్డాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగవారు వెంటనే సుజిత్ కుటుంబసభ్యులకు సమచారం అందించారు. గాయపడ్డ సుజిత్‌ను దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుజిత్‌ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుని సోదరుడు సుశీల్ బాగ్యరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని