Hyderabad News: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. ఇద్దరి మృతి

నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో ఆదివారం అర్ధరాత్రి కారు బీభీత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతూ

Updated : 06 Dec 2021 13:03 IST

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో ఆదివారం అర్ధరాత్రి కారు బీభీత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును వేగంగా నడుపుతూ రోడ్డుపై వెళుతున్న ఇద్దరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను అయోధ్యరామ్‌, దేబంద్రకుమార్‌ దాస్‌గా గుర్తించారు. వీరిరువురు ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగులని పోలీసులు నిర్ధరించారు.

సంఘ‌ట‌న అనంత‌రం నిందితుడు కారుతో పాటు జూబ్లీహిల్స్ వైపు ప‌రార‌య్యాడు. ఇదే స‌మ‌యంలో విధుల్లో ఉన్న పోలీసులు ప్రమాదానికి కార‌ణ‌మైన కారును గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా కారును సీజ్‌ చేసి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని