ఫ్రెండ్‌షిప్‌ డే రోజున విషాదం.. గోదావరిలో ముగ్గురి గల్లంతు

స్నేహితుల దినోత్సం రోజున యువకుల విహారయాత్ర విషాదం నింపింది. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ఆరుగురు యువకులు

Published : 02 Aug 2021 01:15 IST

నందిపేట: స్నేహితుల దినోత్సం రోజున యువకుల విహారయాత్ర విషాదం నింపింది. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ఆరుగురు యువకులు నందిపేట మండలం నడికూడ శివారులో గోదావరి నది వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో వీరు నదిలో స్నానాలు చేయడానికి దిగారు. లోతును అంచనా వేయలేక ముగ్గురు యువకులు రాహుల్‌(20), ఉదయ్‌(19), శివ(19) నీటిలో మునిగిపోయారు. వీరిని గమనించిన మిగతా ముగ్గురు స్నేహితులు నీటమునిగిన వారిని కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని